- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా
by GSrikanth |
ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే కర్నాటక నుండి రాజమహేంద్రవరం వైపు చేపల లోడుతో లారీ వెళ్తుంది. అయితే లారీ జీలుగుమిల్లి మండలంలోని దర్భగూడెం సబ్ స్టేషన్ వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా అదుపుతప్పింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే కర్నాటక నుండి రాజమహేంద్రవరం వైపు చేపల లోడుతో లారీ వెళ్తుంది. అయితే లారీ జీలుగుమిల్లి మండలంలోని దర్భగూడెం సబ్ స్టేషన్ వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా అదుపుతప్పింది. అనంతరం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్లకు గాయాలయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 108లో క్షతగాత్రులను జంగారెడ్డి గూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న జీలుగుమిల్లి పోలీసులు ప్రమాదంపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. క్షతగాత్రుల వాంగ్మూలాన్ని సైతం నమోదు చేసుకున్నారు.
Next Story






